అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో అత్యుత్సాహం ప్రదర్శించి దళిత యువకుడు ఎలకచర్ల నాగేంద్ర ను రాఘవరెడ్డిగారిపల్లి కి చెందిన అగ్రవర్ణాల వారికి చెందిన కొందరు యువకులు చేయని తప్పుకు చెట్టుకు కట్టేసి చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శుక్రవారం సాయంత్రం ఆకేపాడు నవోదయ పాఠశాలలో చదువుతున్న తన అన్న కుమారులను నాగేంద్ర ఇంటికి తీసుకురావడానికి వెళుతుండగా, రాఘవ రెడ్డి గారి పల్లె వద్ద అడ్డుకున్నారు. గతంలో ఊర్లో బైక్ లో ఎక్కువ సౌండ్ చేస్తూ తిరిగేది నీవే అంటూ ఇష్టం వచ్చినట్లు చేయి చేసుకుని చెట్టుకు కట్టేశారు.నేను కాదు అని ఎంత మొత్తుకున్నా వినిపించు పోక సుమారు రెండు గంటలపాటు చెట్టుకు కట్టేసి దాడి చేసినట్లు బాధితులు తెలిపాడు.
తరువాత సాయంత్రం పెద్ద మనుషులు అక్కడికి వెళ్లి నాగేంద్ర ను ఇంటికి తీసుకు వచ్చారు. అవమానం భరించలేక శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో ఉన్న గుళికలను తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే కనుక్కొని వైద్యం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ప్రస్తుతం యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఇతను ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. నేను తప్పు చేయలేదు అని గ్రామస్తులకు ఎంత వేడుకున్నా వినకుండా నన్ను కట్టేసి కొట్టడం వల్ల తీవ్ర అవమానానికి గురి కావడం జరిగిందన్నారు. కాగా ఆస్పత్రిలో రూరల్ పోలీసులు బాధితుణ్ణి దర్యాప్తు చేస్తున్నారు.