రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వీరన్న పల్లి గ్రామానికి చెందిన ఆవుల నరేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లోనే ఉండడంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
అదేవిధంగా వెల్జాల్ గ్రామంలో గుంత యాదయ్య ఇల్లు అసంపూర్తిగా ఉందని వెల్జాల్ గ్రామం ఉపసర్పంచ్ అజిజ్ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో 20 సంచుల సిమెంటు ఇప్పించారు.