ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి నేడు విజయవాడ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించారు. ఉప్పల్ నియోజకవర్గం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గడ్డం రవికుమార్, బద్దం భాస్కర్రెడ్డి,వేముల సంతోష్రెడ్డి తదితరులు ఉన్నారు.