ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రతినిధులను సోమవారం ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాణి రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్ రామ్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ కూకుట్ల నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల తిరుపతి రెడ్డి , ఉపాధ్యక్షులు ఎం. సురేష్, ఏవి. శ్రీధర్ రావు, కోశాధికారిగా ఆర్ యాదగిరి గౌడ్,
సహాయ కార్యదర్శులు గా గుత్తి శేఖర్, జి. శివాజీ, కార్యనిర్వాహక కార్యదర్శి డి రాజు సలహాదారులు కొలనుపాక చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి,సీనియర్ జర్నలిస్టులు వడ్డేపల్లి కిశోర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.