ఉప్పల్ నియోజకవర్గం లోని ఉప్పల్ , కప్రా సర్కిల్ పరిధిలో పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగాన్ని గురువారం జలమండలి ఆధీనంలోని సీసీజి కి అప్పగించారు. ఉప్పల్, కాప్రా సర్కిల్ కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్పొరేటర్లు బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్, కక్కిరేణి చేతన హరీష్, శ్రీ వాణి వెంకటరావు, స్వర్ణ రాజ్ శివమణి, జెర్రిపోతుల ప్రభుదాస్, ఉప్పల్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు అరుణ కుమారి , శంకర్, ఉప్పల్ సర్కిల్ ఈ ఈ నాగేందర్, కాప్రా సర్కిల్ ఈ ఈ కోటేశ్వరరావు, ,సి జి ఎం సునీత, జిఎం జాన్ షరీఫ్, సర్కిల్ డిఈ నిఖిల్ రెడ్డి, డి ఈ కేపీ బాలకృష్ణ, నాగమణి, ఎస్ డబ్ల్యూ డి ఈ చందన, జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.