తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామానికి చెందిన బండెలు సుధాకర్ రెడ్డి అనే రైతు ప్రమాదవశాత్తూ చేయి కోల్పోయాడు.
కొన్ని రోజుల క్రిందట ఆవులకు గడ్డి వేసే సమయంలో గడ్డికోసం యంత్రంలో చెయ్యి పడడంతో దాదాపు సగం చెయ్యి మిషన్లో నలిగిపోయి నుజ్జునుజ్జు అయింది.
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కమలా హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ ఈరోజు ఆస్పత్రిలో ఆ రైతులను పరామర్శించి తన ట్రస్ట్ ద్వారా 10000 రూపాయలను చికిత్స కోసం అందించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీతోపాటు ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్,నాయకులు రాజేందర్ రెడ్డి ,అంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.