రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువతులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ పెళ్లి కానుకలు అందచేసింది. నిరుపేద కుటుంబాలకు అండగా ఉండే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తలకొండపల్లి మండలానికి చెందిన పెరుమాళ్ళ మానస, పెరుమాళ్ళ గాయత్రి లకు వివాహ కానుకగ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తలకొండపల్లి మండలం జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ నేడు అందజేశారు.
నిరుపేదలకు వివాహ సందర్భంగా ఆనందం కలిగించాలనే ఉద్దేశ్యంతో వివాహ ఖర్చుల గాను ట్రస్టు ద్వారా ఇద్దరికీ ఆర్థిక సహాయం అందచేసినట్లు వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్ తొమ్మిదవ వార్డ్ మెంబర్ రమేష్ కటికే జహంగీర్ కాకునూరు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.