32.2 C
Hyderabad
April 20, 2024 19: 45 PM
Slider ప్రపంచం

ట్రంప్ సన్నిహితుడికి బాలికల్ని సరఫరా చేసిన మహిళ అరెస్టు

#Donal Trump

మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన అత్యంత ధనవంతుడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడు అయిన జెఫ్రీ ఎప్ స్టిన్ కేసుకు సంబంధించి ఘీస్లయిన్ మాక్స్ వెల్ ను అమెరికాలోని న్యూ హ్యామ్ స్పియర్ పోలీసులు అరెస్టు చేశారు. జెఫ్రీ ఎప్ స్టిన్ గత ఏడాది మరణించాడు. అతను జీవించి ఉన్నప్పుడు అనేక మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

జెఫ్రీ ఎప్ స్టిన్ కు అత్యంత సన్నిహితురాలు అయిన  ఘీస్లయిన్ మాక్స్ వెల్ పలు ప్రదేశాల నుంచి మైనర్ బాలికలను తీసుకువచ్చి అతనికి అప్పగించేది. ఎప్ స్టిన్ ఆ బాలికలను లోబరచుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేసేవాడు. బాలికలను షాపింగ్ కు తీసుకువెళ్లి వారికి కావాల్సింది కొనిపెట్టేవాడు. వారికి బాగా నమ్మకం కలిగించే వరకూ వారిని జాగ్రత్తగా చూసుకుని ఆ తర్వాత వారిని లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు. ఎంతో మంది బాలికలను లోబరుచుకుని లైంగికంగా వేధించిన ఎప్ స్టిన్ ను ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.

కేసు నడుస్తుండగానే గత ఏడాది ఆగస్టులో అతను మరణించాడు. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా మాక్స్ వెల్ ను గుర్తించారు. 58 ఏళ్ల మాక్స్ వెల్ అనేక మంది మైనర్ బాలికలను అతడికి అప్పగించింది. కరీబియన్ దీవుల్లో, న్యూయార్క్, న్యూ హ్యామ్ స్పియర్ ప్రాంతాలలో వారిని లైంగికంగా అతడు ఉపయోగించుకునేవారు. మాక్స్ వెల్ నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Related posts

సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.25 కోట్ల హెరాయిన్‌ సీజ్

Sub Editor

శ్రమయేవ జయతే

Satyam NEWS

గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం పట్ల అభినందనలు

Satyam NEWS

Leave a Comment