సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన యలక అవినాష్ గౌడ్ జాతీయ స్థాయిలో జరుగుతున్న అండర్ 25 క్రికెట్ మ్యాచ్ లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
నల్గొండ పార్లమెంటు పరిధిలో హుజూర్ నగర్ నియోజక వర్గంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక సైదులు గౌడ్ పెద్ద కుమారుడు అవినాష్ గౌడ్ ఎంపిక కావడం గర్వించ దగ్గ విషయమని అన్నారు.ఆదివారం నాగాలాండ్ లో జరిగే అండర్ 25 క్రికెట్ లో రాణించాలని కోరారు.అవినాష్ గౌడ్ భవిష్యత్ లో క్రికెట్ రంగంలో రాణిస్తూ ఇండియా జట్టుకు సేవలందించాలని మనస్పూర్తిగా కోరారు. సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్