సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం వార్షికంగా అత్యంత వైభవంగా నిర్వహించే గంగమ్మ గంగమ్మ జాతరను ఆదివారం యాదవ సోదరులు గంగమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు.
మాజీ పి.సి.సి అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,పసిడి పంటలతో,సుఖ,సౌఖ్యాలతో ఉండాలని,కరోనాను పారత్రోలి ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారికి పూజలు నిర్వహించానని అన్నారు.అనంతరం యాదవ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్