సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఆయన వారసుడిగా జస్టిస్ యూయూ లలిత్ను ఎన్నుకున్నారు. కొత్త సీజేఐగా జస్టిస్ లలిత్ను నియమించాలని ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల క్రమంలో జస్టిస్ రమణ తర్వాత జస్టిస్ లలిత్ కు సీనియారిటీ ఉంది.
అందుకే వారసుడిగా ఆయన ఎంపికయ్యారు. జస్టిస్ లలిత్ దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్ పదవీకాలం మూడు నెలలు ఉంటుంది. జస్టిస్ యుయు లలిత్ నవంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ రమణ 24 ఏప్రిల్ 2021న దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ రమణ కన్నా ముందు జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.