V serve foundation అనే సేవా సంస్థ తరపు నుంచి బి.దీప్తి, వారి కుటుంబ సభ్యులతో కలిసి, బండ్లగూడా లోని ఫలక్ నుమా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ పాఠశాలలోని ఉపాధ్యాయురాలు డి.సునంద తో వీరికి ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని, ఇంతకు ముందు కూడా పలుసార్లు ఈ చిన్నారుల కోసం ఆటవస్తువులు, బ్యాగులు, పుస్తకాలు, స్వీట్లు అందించడం జరిగింది. వీరి సేవా కార్యక్రమాలు ఇలాగే తమ విద్యార్థులకు అందిస్తూ ఉండాలని సునంద టీచర్ కోరుకున్నారు. ప్రధానోపాధ్యాయులు హనుము నాయక్, మేరీ టీచర్, మధుబాబు కూడా వి సర్వ్ సంస్థకు, దీప్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు.
previous post