తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని అదిలాబాద్ జిల్లా PDSU ఉపాధ్యక్షుడు రాథోడ్ దేవి లాల్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక జూనియర్ కళాశాల లో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా DTF జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, టీ జాక్ అధ్యక్షులు దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాథోడ్ దేవిలాల్ మాట్లాడుతూ నిరుద్యోగులకు కు భృతి ఇవ్వాలని, అదేవిధంగా అదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో లో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు వినోద్ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్ భాస్కర్ నగేష్ కపిల్ రాహుల్ కేశవ్ సాగర్ సచిన్ సచిన్ సుజయ్ జగన్ యువజన సంఘ నాయకులు దేవేందర్ కార్మిక కార్మిక సంఘం నాయకులు జగన్ AISF, SFI, AISB, TAVS, VBA, AIYF, DTF, IFTU, వివిధ విద్యార్థి ఉపాధ్యాయ యువజన కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.