సూపర్ స్ప్రెడర్స్ ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాక్సినేషన్ కార్యక్రమాన్ని అర్హులందరికి అందే విధంగా కృషి చేస్తున్నామని డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం డివిజన్ పరిధిలోని హైటెన్షన్ లైన్ లో సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా సూపర్ స్ప్రెడర్స్ లకు వ్యాక్సినేషన్ అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రతి ఒక్క సూపర్ స్ప్రెడర్ కు వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందే విధంగా ప్రభుత్వం మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలకు, కళాశాలలకు వేసవి సెలవులు ఉన్నందు వల్ల వాటిని వ్యాక్సినేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కెసిసి కార్యదర్శి తుమ్మల మధుకర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకుడు సుబ్రహ్మణ్యం, జిహెచ్ఎంసి ఉద్యోగులు కుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.