సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని పపమ పావన కృష్ణానది తీరాన మట్టపల్లి మహా పుణ్య క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి కోవెలలో గురువారం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి)పర్వడి రోజును భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు నిర్వహించారు.
కోవిడ్ -19 నియమ నిబంధనలు అమలులో ఉన్నందున ఆలయ అర్చకులు తెల్లవారుఝామున స్వామి అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలతో, వివిధ జాతుల సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి విశేష అర్చనలు చేశారు.భక్తులను అనుమతించకుండా ఆగమ శాస్త్ర విధిగా స్వామి,అమ్మవారికి సకల ఉపచారాలు విధిగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు,విజయకుమార్, కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్,ఆలయ అర్చకులు ఫణికుమారాచార్యులు,తూమాటి శ్రీనివాసాచార్యులు,పద్మనాభాచార్యులు, దేవస్థాన సిబ్బంది కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్