తెలుగు రాష్ట్రాలలో మార్గశిర మాస శుద్ద ఏకాదశి ,వైకుంఠ ఏకాదశి సందర్బంగా అన్ని దేవాలయాలలో తెల్లవారుజాము నుంచీ విశేష పూజలు ప్రారంభించబడ్డాయి.
అందులో భాగంగా ఏపీలోని విద్యలనగరంగా భాసిల్లిన విజయనగరంలోని అన్ని వైష్ఠవ దేవాలయాలలోనూ,వెంకన్న గుడులలో స్వామి వారు విశేష పూజలందుకున్నారు.
ముఖ్యంగా నాటి పూసపాటి వంశీయుల కాలంలో అంటే సుమారు 400 ఏళ్ల క్రితం కోవెల వీధిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో గత అర్ధరాత్రి నుంచీ దేవాలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ మూల వీరాట్టు తో పాటు ప్రత్యేకించింది వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసింది…దేవాదాయ ధర్మాదాయశాఖ.
దీంతో తెల్లవారుజామున 3 గంటల నుంచీ వెంకన్న… భక్తులచే పూజలందుకున్నారు.