సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు,కార్యకర్తలు అటల్ బిహారీ వాజ్ పాయ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు,గుర్రంపోడు భూ ఉద్యమ నాయకుడు,న్యాయవాది బాలాజీ నాయక్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి,మాజీ ప్రధాని వాజ్ పాయ్ అన్నారు. బిజెపి పార్టీ ఎస్సీ,ఎస్టీ ల కొరకు షెడ్యూల్ కులాలు,షెడ్యూల్ తెగల వేధింపుల నిరోధక చట్టం 1989 సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్.14566 పెట్టడం సంతోషదాయకమని అన్నారు. సామాజిక న్యాయ,సాధికారత దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని,ఎస్సీ,ఎస్టీ లపై వివక్షకు ముగింపు పలకడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. గుర్రం పోడు ఘటనలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ గుర్రంపోడు భూమి మీదకు రావడం చారిత్రాత్మకమైన నిర్ణయం అని,ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన సోదరులు సాగు చేసుకుంటున్న పోడు భూములు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయని బాలాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తిరుమల రావు,రామరాజు,ప్రసాద్,గోపి,విజయ్, కోటయ్య,సైదా,మురళి,వెంకటేశ్వర్లు, రవి,రాజు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్