36.2 C
Hyderabad
April 16, 2024 22: 20 PM
Slider మహబూబ్ నగర్

మంత్రి నిరంజన్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజానేత వాకిటి

#VakitiSridhar

వనపర్తికి 5 కిడ్నీ డయాలిసిస్ యూనిట్లను మంజూరు చేయించిన మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతో మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తరుణంలో పేదరికంతో ఇతర ప్రాంతాలకు  వెళ్లి డయాలసిస్ చేసుకొనే అవకాశం లేదని ఆయన తెలిపారు.

ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని గమనించి  పెద్ద ఎత్తున 5 యూనిట్లను మంజూరు చేయించిన ఘనత మంత్రి నిరంజన్ రెడ్డికి దక్కిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరువాత ఇన్ని యూనిట్స్ వనపర్తికి  మంజూరు అయ్యయంటే మంత్రి నిరంజన్ రెడ్డి  కృషి ఉందన్నారు.

వందలాది మంది ప్రాణాలు కాపాడే ఈ డయాలిసిస్ యూనిట్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు, హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ కు, మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి  ధన్యవాదాలు తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

పార్టీ ఆదేశించింది: ఇక నుంచీ అన్నీ తానే…అంత‌టా నేనే….!

Satyam NEWS

ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Satyam NEWS

అభాగ్యులకు అండగా దేవాడ గ్రామస్తులు

Satyam NEWS

Leave a Comment