హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ వాల్మీకి సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బాగ్ అంబర్ పెట్ డివిజన్ లోని భరత్ నగర్ కమ్యూనిటీ హల్ లో వాల్మీకి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్, బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డి పి రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రామాయణ మహా కావ్యం రచయిత, ఆది కవి వాల్మీకి జయంతి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సమాజ్ కమిటీ సభ్యులు సత్పాల్ సింగ్ జి, భూపాల్ సింగ్ జి, భగత్ సింగ్ జి, వినోద్, ప్రీతం, ధరమ్, అజిత్, రాహుల్, వినోద్, ప్రవీణ్, సందీప్ సింగ్, అనిల్ రామ్, అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, శ్రీరాములు ముదిరాజ్, జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, విష్ణు, తిరుపతి, నాగరాజు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, అంబర్ పేట్