మహర్షి వాల్మీకి జయంతి ని ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, LC. నాయక్, అడిషనల్ డీసీపీ కుమారస్వామి మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
‘మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మహోన్నత ఇతిహాసమైన రామాయణ ద్వారా శ్రీరాముని పావన చరితాన్ని మనకు తెలియజేసిన వారి తత్త్వబోధ మనల్ని మేలైన మార్గంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నామని డిసీసీ అన్నారు.
కార్యక్రమంలో RI సాంబశివరావు,CI తుమ్మ గోపి, మినిస్ట్రీయల్ స్టాఫ్ AO అక్తరునీసాబేగం, జానకిరామ్, నాగేశ్వరరావు ,హనీఫ్ పాల్గొని వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.