తిరుపతి అభ్యర్థి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఫోటోలు పెట్టారని, దీనికి జగన్, సజ్జలపై అట్రాసిటీ కేసు పెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో దళితులపై తరుచూ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి పక్షం చేసిన ఫిర్యాదులను కేసులు నమోదు చేయకుండా బుట్టలో పడవేస్తున్నారని ఇదేం న్యాయమని వర్ల రామయ్య ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, టీడీపీ నేత పోతినేని శ్రీనివాస్ తదితరులున్నారు.