సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రం లోని శ్రీ లక్ష్మీ నృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో ‘శ్రీ పంచమి,(వసంత పంచమి)’పర్వదిన సందర్భంగా ‘గాయత్రి మహా యజ్ఞం నిర్వహించారు.
శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర స్వామివారి 28వ జన్మదిన సందర్భంగా ‘వేద సప్తాహ’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా నాల్గవ రోజు మంగళవారం సరస్వతీ మహా యజ్ఞం వేద పండిత, ఘనాపాటిల తో అత్యంత వైభవోపేతంగా వసంత పంచమి నిర్వహించారు.
అనంతరం కృష్ణ యజుర్వేద పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ శ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి విజయవాడ, గుండ్లపల్లి విశ్వనాథ ఘనాపాటి హైదరాబాద్,గుండ్లపల్లి శివశర్మ శ్రౌతి ఇరగవరం తణుకు, చింతపల్లి శశాంక ఘనాపాటి గుంటూరు, కంభంపాటి నటరాజ ఘనాపాటి విజయవాడ, ఫణి శర్మ మట్టపల్లి,
ఆకెళ్ళ రామకృష్ణ ఘనాపాటి హైదరాబాద్, గుండ్లపల్లి అమరశర్మ ఇరగవరం తణుకు,దుర్భాకుల సాంబమూర్తి అవధాని నందిగామ, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ చెన్నూరు విజయకుమార్, మట్టపల్లి రావు,బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము నిర్వాహణా కమిటీ కన్వీనర్ నారపరాజు శ్రీనివాస రావు, కార్యదర్శి చెన్నూరు మట్టపల్లి రావు,
కోశాధికారి బాచిమంచి గిరిబాబు, ఉపాధ్యక్షుడు నారపరాజు పురుషోత్తమ రావు, సభ్యులు భువనగిరి శ్యాం సుందర్, బాచిమంచి చంద్రశేఖర్,దుగ్గరాజు గోపాలకృష్ణ మూర్తి, శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ బ్రాహ్మణ వేద పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు,వేదాభిమానులు తదితరులు పాల్గొన్నారు.