32.2 C
Hyderabad
March 28, 2024 21: 33 PM
Slider ఆధ్యాత్మికం

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Tirumala

తిరుమలలోని శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండపంలో గత మూడురోజులపాటు జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు మంగ‌ళ‌వారంనాడు ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొన్నారు.

చివరిరోజున శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. కాగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాధ్ జెట్టి, ఆల‌య‌ డెప్యూటీ ఈవో  హరింద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

సంక్రాంతి పండుగ

Satyam NEWS

కొమరం భీం స్పూర్తితో ఆదివాసీలు ఉద్యమించాలి

Satyam NEWS

అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment