వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని తన ప్రతిభతో అత్యంత ప్రతిష్టాత్మక నెట్అకాడ్ రైడర్స్ ఇండియా ఛాంపియన్గా నిలిచింది. ఫిబ్రవరి 27 2023 నాడు బెంగళూరులో జరిగిన సిస్కో జాతీయ సదస్సులో నెట్అకాడ్ రైడర్స్ ఇండియా ఛాంపియన్గా భాషిత రెడ్డి నిలిచారు.
వాసవి ఇంజనీరింగ్ కళాశాల లో ఆమె కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. సిస్కో కార్పొరేట్ వ్యవహారాల రీజినల్ మేనేజర్ మార్సెల్లా ఓషీ చేతుల మీదుగా ఈ బహుమతిని భాషిత అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు శిక్షణ ఇచ్చి మార్గనిర్దేశం చేసినందుకు భాషిత రెడ్డి వాసవి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జితేందర్రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా వాసవి కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్, మరియు అకాడమీ సపోర్ట్ సెంటర్ టాస్క్మేనేజర్ జఫ్ఫార్ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఈ రోజు వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వీ రమణ, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఆదిలక్ష్మి ఆమెను ప్రత్యేకం గా అభినందించారు. తన విజయానికి తన తల్లిదండ్రులు సోమి రెడ్డి, భారతి తనను ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని చెప్పారు.