కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట జూనియర్, డిగ్రీ మరియు పీజీ కళాశాల 18 వ వార్షికోత్సవం జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి శివారులో గల లక్ష్మీదేవి గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఎంజాయ్ మెంట్ కూడా అవసరమన్నారు.
అలా అని చదువుని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని విద్యార్థులకు సూచించారు. అనంతరం చైర్మన్ ను శాలువా, మెమోంటోతో కళాశాల యాజమాన్యం సన్మానించింది. తర్వాత విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించారు.
ముఖ్యంగా విద్యార్థులు దేశభక్తి గితాలపై డాన్సులు చేశారు. పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల క్యారెస్పాండెంట్ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ రావు, కో ఆర్డినేటర్ దత్తాత్రి, వశిష్ట జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ రాజేశ్వర్, విజయ్ కుమార్, అకడమిక్ డీన్ నవీన్, ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఆర్.కె ప్రిన్సిపాల్ గురువెంధర్ రెడ్డి, వశిష్ట వైస్ ప్రిన్సిపాల్ సదాశివ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు