Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన వసుధ ఫౌండేషన్

#Kadambari Kiran

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా నటుడు కాదంబరి కిరణ్ విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్రముఖ వ్యాపారవేత్త, వసుధ ఫౌండేషన్ అధినేత మంతెన వెంకట రామరాజు.

“ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళ్తుండడం, అందులో తాను  కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. భావి  తరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని అందించాలంటే అందరూ మొక్కలు నాటాలి అని అన్నారు వసుధ వెంకట్రామ రాజు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేళ్లచెరువు జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Satyam NEWS

అధికారం కోస‌మే టీడీపీ మా పొట్ట కొడుతోంది…!

Satyam NEWS

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

mamatha

Leave a Comment

error: Content is protected !!