36.2 C
Hyderabad
April 24, 2024 22: 30 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ 28వ జన్మదినోత్సవ నాడు వేద సప్తాహం

#Veda Saptaham

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీలక్ష్మి నరసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, వేద పాఠశాల ప్రాంగణంలో 13 నుండి 19 వరకు ప్రఖ్యాత వేద పండితులచే సంపూర్ణ వేదపారాయణం (వేద సప్తాహం) నిర్వహించనున్నారు.

ప్రతిరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 3:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు బ్రహ్మశ్రీ వేదమూర్తులు  ప్రముఖ పరీక్ష అధికారులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి (వేద పండితులు శ్రీ కనకదుర్గ దేవస్థానం విజయవాడ) శృతితిలక బిరుదాంకితులు బ్రహ్మశ్రీ  వేద మూర్తులు చల్లపల్లి సుబ్రహ్మణ్య ఘనాపాటి (విజయవాడ) అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహామహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ(రాజమహేంద్రవరం), వేద పాఠశాల నిర్వాహక సభ్యులు, ఆంజనేయ ఘనాపాటీ వేద శాస్త్ర పరిషత్ (తణుకు) నిర్వాహకులతో పాటు 10 మందికి పైగా వేద ఘనాపాటీలు పాల్గొంటారని శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం,వేద శాస్త్ర పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు కరోనా నియమ,నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

Related posts

కోమటిరెడ్డీ… రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటున్నావ్

Satyam NEWS

బెస్తవారిపేట మండలంలో నకిలీ బంగారం కలకలం

Satyam NEWS

ఏప్రిల్ 18న శ్రీ భాష్యకారుల సాత్తుమొర‌

Satyam NEWS

Leave a Comment