27.7 C
Hyderabad
April 25, 2024 07: 10 AM
Slider హైదరాబాద్

ప్రతిష్టాత్మకంగా వడ్డెర ఆత్మగౌరవ భవన నిర్మాణం

#gangula

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో బీసీ కులాల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల విలువైన స్థలాన్ని హైదరాబాద్ నడిబొడ్డున కేటాయించింది.  కోకాపేట్, ఉప్పల్ బగాయత్లో  87.3 ఎకరాల్లో 41 వెనుకబడిన కులాలకు 95కోట్లతో ఆత్మగౌరవ భవనాల్ని నిర్మించబోతుంది. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు కరీంనగర్ లోని తన నివాసంలో వడ్డెర కుల సంఘ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ ను వడ్డెర ఏక కుల సంఘ నాయకులకు అందజేశారు.

ఉప్పల్ బగాయత్లో ఎకరా స్థలం కోటి రూపాయలతో నిర్మించబోయే వడ్డెర కుల సంఘ భవనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అందుకున్న కుల సంఘ నాయకులు అతి త్వరలో ఆత్మగౌరభవన నిర్మాణం ప్రారంభించుకుంటామని తెలియజేశారు. ఆత్మగౌరవ భవనాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ధన్యవాదాలు తెలియజేశారు

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కేవలం సీఎం కేసీఆర్ కృషితోనే వెనుకబడిన వర్గాల్లో ఆత్మగౌరవం వెల్లివిరిస్తుందన్నారు. 19 బీసీ గురుకులాలను 310కి పెంచడమే కాకుండా ఒకే సంవత్సరంలో 112 గురుకులాలను జూనియర్ కాలేజీ లుగా అప్ గ్రేడ్ చేస్తూ నూతనంగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేసి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి చూపిస్తున్నారన్నారు. ఆత్మగౌరవ భవనాల కోసం సైతం వేల కోట్ల విలువైన స్థలాల్ని కేటాయించిన ముఖ్యమంత్రి కి ప్రతి ఒక్కరు బలాన్ని అందించాలన్నారు. ఏక సంఘ ట్రస్ట్ నిర్మాణాలతోపాటు ప్రభుత్వం నిర్మించే ఆత్మగౌరభవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు జె సత్యనారాయణ రాజు, ఎత్తరి అంతయ్య, ఓర్పు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి

Satyam NEWS

ఆపదలో ఉన్నప్పుడు ప్రతి బాలిక 100 కు డయల్ చేయాలి

Satyam NEWS

వెయ్యి మంది మహిళలతో బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

Leave a Comment