వేములవాడ రాజన్న ఆలయం లో నిజాయితీ గా ఉంటూ ఉన్న ఊర్లో కడుపులో చల్ల కదలకుండా నౌకరి చేయాలని ఎంత చెప్పినప్పటికీ కొందరు ఉద్యోగుల్లో ఎంతకీ మార్పు రావడం లేదు.యతా రాజా తథా ప్రజా అన్నట్లుగా ఏ ఈ.ఓ కాలంలో ఆ ఈ.ఓ కు తగ్గట్టూగా ఉద్యోగం చేయాలని ఇప్పుడు ఉన్న ఆలయ ఈ.ఓ నిజాయితీ గా ఉండగా తాము నిజాయితీ గా ఉండాలని , లేకుంటే వేటుపడుతుందని గత ఈ.ఓ కాలం లో లా ఇస్ట రాజ్యం గా ఉండొద్దనే ఆలోచనే వారిలో మచ్చుకైనా కనపడటం లేదు.
ఈ నేపత్యం లో ఆలయం లో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న లాల రాజు ను సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈ.ఓ కృష్ణవేణి శుక్రవారం తెలిపారు.లడ్డు కౌంటర్ లో లడ్డులను అమ్మిన డబ్బులతో నుండి లక్ష రూపాయలు వ్యక్తిగతం గా వాడుకున్నట్లు తేలడం తో విచారణ జరిపి అతన్ని ఉద్యోగంనుండి తొలగిస్తున్నట్లు ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.ఇకపై ఇలాంటి అవినీతి కార్య క్రమాలకు పాల్పడేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.