వేములవాడ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాల సందర్బంగా కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపూర్ వరకు 2కే రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంను ఎస్సై శివకేశవులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 మంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్సై శివకేశవులు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాజశేఖర్ గౌడ్, మనోహర్, అనిల్, పట్టణ ప్రజలు, యువ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
previous post