మేడారం సమ్మక్క-సారక్క జాతర చివరి వారం సందర్భంగా విచ్చేసిన భక్తులతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి హుండీ ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. 7 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారికి హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది బుధవారం లెక్కించారు.
ఈ సందర్భంగా 99 లక్షల 10 వేళా రూపాయల నగదు లభించింది. 175 గ్రాముల బంగారం, 7 కిలోల 300 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఆలయ ఈవో ఎంఎండి కృష్ణవేణి తెలిపారు. ఆలయ ఉద్యోగులు, సత్యసాయి సేవా సమితి వలంటీర్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.