వేములవాడసింగల్ విండో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను ఆదివారం ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.సంఘం ఛైర్మన్ గా ఏనుగు తిరుపతి రెడ్డి , వైస్ ఛైర్మన్ తూము లక్ష్మి కాంతారావు లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు ఎన్నికల అధికారి మధుకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు.విండో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ను మర్యాద పూర్వకం గా తిరుపతి రెడ్డి కలిశారు.ఈ సంధర్బాహం గా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ సొసైటీ కి మంచి పేరు తీసుకురావాలని తన సహాహారం ఎప్పుడు వారికి ఉంటుందని తెలిపారు.కాగా తిరుపతి రెడ్డి సొసైటీ చైర్మన్ గా గెలవడం ఇది రెండవసారి.గత పాలకమండలిని విజయవంతంగా లాభాల బాటలోకి తీసుకువెళ్లిన పేరు యువకుడైన అతనికి ఉంది.కాగా తిరుపతి రెడ్డిని సొసైటీ సి ఈ ఓ లక్ష్మణ్ అభినందించారు.