కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం లో దర్శనాలు నిలిపివేశారు.
ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వీలు ఉండదు.
ఈ మేరకు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అదే విధంగా శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు.
21వ తేదీన శ్రీ సీతారామ స్వామి కళ్యాణం ఆలయంలో అంతర్గతంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు.