కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దేవాలయాలపై ప్రభావం చూపుతున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవస్థానం కూడా లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నది. 12వ తేదీ బుధవారం నుండి 21వ తేదీ శుక్రవారం వారం వరకు లాక్ డౌన్ అమలు జరుగుతున్నందున వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దర్శనాలు నిలుపుదల చేశారు. శ్రీ స్వామి వారి నిత్య పూజలు మాత్రం అంతరంగికముగా నిర్వహిస్తామని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.