మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆకాశానికి ఎత్తారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరపడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ‘ఏపీ దిశ’ బిల్లుకు ఆమోద ముద్ర వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను.
ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను అని వెంకయ్య నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు.