28.7 C
Hyderabad
April 24, 2024 03: 36 AM
Slider నెల్లూరు

యాచేంద్ర ఆశీస్సులు తీసుకున్న వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్

venkatagiri Municipality

వైఎస్ఆర్ సీపీ నాయకుడు, వెంకటగిరి సంస్థానాధీశుడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, డాక్టర్. వి.బి. సాయి కృష్ణ యాచేంద్రను వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు.

మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాను వెంకటగిరి మునిసిపల్ కౌన్సిలర్లను కూడా ప్రత్యేకంగా కలిసినట్లు భానుప్రియ తెలిపారు.

ఆమెతో బాటు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్ చింతపట్ల ఉమామహేశ్వరి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ పూజారి లక్ష్మి తదితరులు కూడా ఉన్నారు.

1,2,3,4,5,6,8,11,12,13 వార్డుల కౌన్సిలర్ల నివాసాలకు వెళ్లి వారిని సత్కరించి, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, పార్టీ విప్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పర్యటించిన 10 వార్డులలోని ప్రజలు నాయకులకు బాణాసంచాలు కాల్చి, అపూర్వ స్వాగతం పలికారు. కౌన్సిలర్లు వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు వెంకటగిరి పట్టణ అభివృద్ధి కి అందరం కలిసి కృషి చేద్దామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తూపాటి చెంచయ్య, చింతపట్ల మురళి నాయుడు, చింతపట్ల శ్రీనివాసులు నాయుడు, మాజీ కౌన్సిలర్ రొంటాల చిన్న, మాజీ కౌన్సిలర్ చల్లా మల్లికార్జునరావు, వెంకటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ  డైరెక్టర్ రాజు, వైఎస్ఆర్సిపి నాయకులు పుట్టా గురు ప్రకాష్, వెంకటసుబ్బయ్య తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కె.రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు

Related posts

దసరాకు టీఎస్ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు

Bhavani

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

Satyam NEWS

పెండింగ్ పనులపైనే నా దృష్టి…!

Satyam NEWS

Leave a Comment