31.7 C
Hyderabad
April 19, 2024 02: 13 AM
Slider హైదరాబాద్

కోవిడ్ బాధితులకు ఆహారం పంచిన విహెచ్ పి

#VHP

కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేశన్ లో ఉన్న వారికి విశ్వ హిందూ పరిషత్ ( విశ్వ హిత సేవా ట్రస్ట్ ) ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా భోజన సదుపాయంతో పాటు  అవసరమైన పేదలకు,  నిత్యా వసర  సామగ్రిని అందిస్తున్నారు. శుక్రవారం సుందర్ నగర్ లోని ప్రైమ్ రెసిడెన్సీ లో సేవా ట్రస్ట్ పదాధికారులు, వి హెచ్ పి ధర్మ ప్రసార తెలంగాణ రాష్ట్ర సంపార్క్ ప్రముఖ రాపర్తి రవి కుమార్, కార్యవర్గ సభ్యులు మనికంటి రమణ నిత్యావసర వస్తువుల ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లక్ డౌన్ కారణంగా అనేక మంది ఇబ్బందుల గురవుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు సేవా ట్రస్ట్  అగ్ర స్థానంలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సిబ్బంది కీ , కొంత మంది ఎంపిక చేసిన వివిధ ఉపాధి వర్గాల  వారికి సామగ్రిని అందజేశారు. ఈ ఆపద సమయంలో ఆహారం, ఇతర సహకారం కావాల్సిన వారు తమను సంప్రదించాలని రవి కుమార్ పేర్కొన్నారు.

Related posts

మనోధైర్యంతో కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరిన సిఐ

Satyam NEWS

హైటెక్ పద్ధతిలో మట్కా నిర్వహిస్తున్న ఐదుగురు అరెస్టు

Satyam NEWS

పోతిరెడ్డిపాడుపై రాజీలేని పోరాటం చేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment