వచ్చేనెల 10,11 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ మార్గదర్శక మండలి సమావేశానికి హాజరుకావాలని మంత్రాలయం పీఠాధిపతి పూజ్యశ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాదులవారిని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి ఆహ్వానించారు.
ఆయనతో బాటు రాష్ట్ర సహ కార్యదర్శి ఎస్. ప్రాణేష్, భజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ టి. ప్రతాపరెడ్డి కూడా ఉన్నారు. ముందుగా శ్రీ మంచాలమ్మ దేవి ని, శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.
విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం మేరకు జాతీయ మార్గదర్శక మండలి సమావేశాల కు హాజరయ్యేందుకు పీఠాధిపతి సుముఖుత వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం క్షేత్ర దర్శనానికి ప్రపంచంలో హిందువులు లక్షలాది గా, వేలాదిగా వస్తున్నారని కొనియాడారు.
తుంగభద్ర నదీ పుష్కరాల మహోత్సవాలలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్. ప్రాణేష్, తూముకుంటప్రతాపరెడ్డి, సాంబశివా రెడ్డి లు పాల్గొన్నారు.