విజయనగరం జిల్లా రామతీర్ధంలో శ్రీరాముని విగ్రహానికి దుండగులు చేసిన అపచారానికి నిరసనగా విజయవాడ మహానగర్ లో విశ్వహిందూ పరిషత్ నిరసన యాత్ర నిర్వహించింది.
సాయంత్రం 6 గంటలకు సత్యనారాయణపురం VHP కార్యాలయం నుండి BRTS రోడ్డు వరకు పాదయాత్ర జరిగింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది.
హిందూ ధర్మపైన జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. గతంలో హిందూ దేవాలయాల పైన దాడులు జరిగినా ఎవరినీ అరెస్టు చేయలేదని వారు అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో VHP అధ్యక్షులు సాన శ్రీనివాస్, కార్యదర్శి P.రాఘవరాజు, చల్లా లక్ష్మీనారాయణజీ, నాగలింగ శివాజీ, పీయూష్ దేశాయ్ హిందూ బంధువులందరూ పాల్గోని నిరసన తెలియజేశారు.