36.2 C
Hyderabad
April 25, 2024 22: 36 PM
Slider కృష్ణ

రామతీర్ధం ఘటనకు విశ్వహిందూపరిషత్ నిరసన యాత్ర

#VHPVijayawada

విజయనగరం జిల్లా రామతీర్ధంలో శ్రీరాముని విగ్రహానికి దుండగులు చేసిన అపచారానికి నిరసనగా విజయవాడ మహానగర్ లో విశ్వహిందూ పరిషత్ నిరసన యాత్ర నిర్వహించింది.

సాయంత్రం 6 గంటలకు సత్యనారాయణపురం VHP కార్యాలయం నుండి BRTS రోడ్డు వరకు పాదయాత్ర జరిగింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది.

హిందూ ధర్మపైన జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. గతంలో హిందూ దేవాలయాల పైన దాడులు జరిగినా ఎవరినీ అరెస్టు చేయలేదని వారు అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో VHP అధ్యక్షులు సాన శ్రీనివాస్, కార్యదర్శి P.రాఘవరాజు, చల్లా లక్ష్మీనారాయణజీ, నాగలింగ శివాజీ, పీయూష్ దేశాయ్ హిందూ బంధువులందరూ పాల్గోని నిరసన తెలియజేశారు.

Related posts

5,204 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Bhavani

వరంగల్ జిల్లాలో మైనర్ బాలికపై పైశాచిక అత్యాచారం

Satyam NEWS

తబ్లిగీ జమాత్ ను పొగిడిన ఐఏఎస్ అధికారికి షోకాజ్

Satyam NEWS

Leave a Comment