28.7 C
Hyderabad
April 20, 2024 05: 39 AM
Slider వరంగల్

కరోనాను జయించిన ములుగు యువకుడు

#corona positive

మనిషి తలుచుకుంటే ‘ఈ లోకంలో కాదేది అనర్హం ‘ అన్నచందాన కేవలం పది రోజుల లోనే ప్రాణాంతక కరోనా వ్యాధిని  జయించాడు ఓ యువకుడు. ములుగు మండలం గుంటూరుపల్లి  గ్రామానికి చెందిన గడిపెల్లి హరికిషోర్ అనే యువకుడికి గత నెల 25 న కరోనా పాజిటివ్ వచ్చింది.

ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో  డాక్టర్ల సలహా మేరకు,పౌష్టిక ఆహారం తీసుకుంటూ మనోధైర్యంతో పాటు మానసికంగా సిద్ధమై కరోనాకు వ్యతిరేకంగా పోరాడి కరోనా వ్యాధిని జయించాడు, మన దగ్గర పోరాడే పట్టుదల ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైన సులభంగా  బయట పడవచ్చని నిరూపించాడు.

హారికిషోర్  ఆరోగ్యంగా ఉండటంతో ఈ రోజు టెస్టులు చేయగా నెగిటివ్ అని తేలడంతో అతడి డిశ్చార్జ్ చేశారు, యువకుడు హారికిషోర్ మాటలలో పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ప్రశాంతతో పాటు స్వీయ సంరక్షణ పాటించనని పేర్కొన్నాడు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో గ్రామంలో చుట్టుప్రక్కల వాళ్ళు,  కాలనీలో వాసులు చూపించిన వివక్షత చాలా బాధాకరం అని అన్నాడు.

Related posts

తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం

Bhavani

సిమ్ కార్డు అమ్మకందారులకు కేంద్ర హెచ్చరిక

Satyam NEWS

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నిరసన

Satyam NEWS

Leave a Comment