38.2 C
Hyderabad
April 25, 2024 14: 45 PM
Slider హైదరాబాద్

సీఎం కేసీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయం బండి

bandi1

నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తామ‌ని, నీతి, నిజాయితీగా రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ప‌నిచేస్తూ, బీజేపీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి, జాతీయ స‌మ‌గ్ర‌త‌కు కాపాడ‌తామ‌ని చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ద‌య‌తోనే తామంతా (బీజేపీ కార్పొరేట‌ర్లు) విజ‌యం సాధించామ‌ని చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన కార్పొరేట‌ర్ల‌తో పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ కార్పొరేట‌ర్ల‌తోపాటు ఎమ్మెల్యే రాజాసింగ్‌, పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

క‌ల్వ‌కుంట్ల అవినీతిని కేంద్రం బ‌య‌ట‌కు తీస్తోంది

ఈ సంద‌ర్భంగా పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ.. భాగ్య‌న‌గ‌రం అభివృద్ధి కోసం పాటుపడుతామని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. సీఎం కేసీఆర్ పొర్లు దండాలు పెట్టినా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని బండి హెచ్చ‌రించారు. సీఎం అనాలోచిత నిర్ణ‌యాలు, చేత‌గాని త‌నం, మూర్ఖ‌త్వం వ‌ల్ల పాత‌బ‌స్తీ నేడు అసాంఘిక శ‌క్తుల‌కు అడ్డాగా మారింద‌ని ఆరోపించారు. పాత‌బ‌స్తీ త‌మ‌ద‌ని పేద‌లు నివ‌సించే ప్రాంతంలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్య‌మ‌ని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ క‌ల్వ‌కుంట్ల కుటుంబాలు భారీ అవినీతికి పాల్ప‌డ్డాయ‌ని విమ‌ర్శించారు. కేంద్రం అన్ని లెక్క‌ల‌నూ బ‌య‌ట‌కు తీస్తోంద‌ని ఇక సీఎం కేసీఆర్ పొర్లు దండాలు పెట్టినా త‌ప్పించుకోలేర‌ని అన్నారు. బీజేపీపై టీఆర్ఎస్‌, బీజేపీలు క‌లిసి అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు.

కార్పొరేట‌ర్ల‌కు బీజేపీ రాష్ర్ట ఇన్‌చార్జీ త‌రుణ్‌చూగ్ అభినంద‌న‌లు

అనంత‌రం పార్టీ శ్రేణులంతా క‌లిసి బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జీగా నియ‌మితులైన త‌రుణ్‌చూగ్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. బీజేపీ పార్టీ కార్యాల‌యం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న్ను క‌లిశారు. త‌రుణ్‌చూగ్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం బీజేపీ శ్రేణులంతా క‌లిసి పార్టీ శ్రేయ‌స్సుకు ప‌నిచేయాల‌ని సూచించారు. అనంత‌రం కార్పొరేట‌ర్లుగా విజ‌యం సాధించిన కార్పొరేట‌ర్ల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Related posts

జగన్ సాక్షిగానే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం

Satyam NEWS

నరసరావుపేట లో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పర్యటన

Satyam NEWS

వైసీపీ పార్టీకి చెందిన గూండాలపై రౌడీషీట్ తెరవాలి

Satyam NEWS

Leave a Comment