విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సు మెంట్ అధికారి కె. ఈశ్వర రావు పర్యవేక్షణలో విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ అధికారులు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ, గురజాలలో
సీడ్స్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. పిడుగురాళ్ళలో రెండు, గురజాలలో రెండు మొత్తము 4 “6A” కేసులు నమోదు చేసి 911 కిలోల కాటన్ అండ్ చిల్లీస్ సీడ్స్ 2.92 లక్షల విలువ కలవి స్వాధీన పరచుకున్నారు. Rs.5.56 లక్షల విలువ కల
సీడ్స్ కు “స్టాప్ సేల్” నోటీసులను ఇచ్చారు.ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్స్ A.శ్రీహరి రావు, T.లక్ష్మా రెడ్డి, వ్యవసాయ అధికారి J.వాసంతి, తహసిల్దార్ కె. నాగ మల్లేశ్వర రావు, స్తానిక వ్యవసాయ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.