వచ్చే నెల 10 న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 14 న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లు,మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు ఆయా జిల్లా యంత్రాంగం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
పోలింగ్ కేంద్రాలు,అలాగే కౌంటింగ్ కేంద్రాలను జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్,ఎస్పీ రాజకుమారీలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైనే సమీక్షలు జరుపుతున్నారు.
ఈ నేపధ్యంలో జిల్లాలో ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికల నిర్వహణపై ఎస్పీ ఆయా డీఎస్పీలతో సమావేశాలు జరుపుతున్నారు.
అందులో భాగంగా పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నగర డీఎస్పీ సుభాష్, సీఐ లక్ష్మణ రావు..ఇతర సిబ్బందితో పార్వతీపురంలోనే ఎస్పీ రాజకుమారీ సమీక్ష నిర్వహించారు.
మార్చి నెల 10 జిల్లాలో ఉన్న విజయనగరం కార్పొరేషన్ తో పాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల పంచాయితీకు పోలింగ్ జరుగుతుందన్నారు. తదనుగుణంగా బందో బస్తు నిర్వహణపై పట్టణ శాఖ సిబ్బందితో ఎస్పీ చర్చించారు.