32.7 C
Hyderabad
March 29, 2024 12: 10 PM
Slider ప్రపంచం

హాజరు హో:లండన్ కోర్టులో విచారణకు విజయ్ మాల్యా

for sale vijay malya

ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా ఫై లండన్ కోర్టులో విచారణ జరగ్గా అయన కోర్ట్ కు హాజరయ్యారు. మాల్యా తరఫు న్యాయవాది క్లేర్ మాంట్ గోమెరీ వాదిస్తూ తన క్లయింటును భారత్ కు పంపాలంటూ గతంలో తీర్పు వచ్చిందని, కానీ ఆ సమయంలో ఆధారాలను పట్టించుకోలేదని, 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దివాలా తీయడానికి గల కారణాలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆరోపించారు.

ఇదేమీ మనీ సర్క్యులేషన్ తరహా నేరం కాదని, ఇదో విమానయాన సంస్థకు సంబంధించిన దివాళా అంశమని తెలిపారు. డాక్టర్ మాల్యా రాత్రికి రాత్రే కుబేరుడు కాలేదని, అపారమైన సంపద ఆయన సొంతం అని వాదించారు.దీనికి భారత ప్రభుత్వం స్పందిస్తూ, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై మాల్యా విచారణ ఎదుర్కోవాల్సిందేనని కోర్టులో వాదనలు వినిపించింది. దీనిపై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. భారత్ లో ఆయనకు ఉన్న అప్పులన్నీ తీర్చాల్సిదేనని వారు తెలిపారు.

Related posts

సౌకర్యాలు కల్పించకుండా మార్కెట్ ఎందుకు తరలించారు?

Satyam NEWS

రుణ దరఖాస్తు గడువును పొడిగించండి.

Bhavani

రానున్న రోజుల్లో బిజెపి కి పరాభవం తప్పదు

Satyam NEWS

Leave a Comment