37.2 C
Hyderabad
March 28, 2024 18: 54 PM
Slider విజయనగరం

స‌చివాల‌య సిబ్బందిపై ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్  ఆగ్ర‌హం

#vijayanagaramcollector

కలెక్టర్.. ఓ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్… జిల్లా కు నిర్ణయాధికారి. మరి అలాంటి కలెక్టర్ కు ఆగ్రహం వస్తే… ఆ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కు కోపం వస్తే…అదే జరిగింది.. విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి స‌చివాల‌య సిబ్బందిపై క‌లెక్ట‌ర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. స‌చివాల‌యాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచాల‌ని, సిబ్బంది ప‌నితీరును మెరుగు ప‌ర్చాల‌ని ఆదేశించారు.

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌లో ఉన్న 37 వ స‌చివాల‌యాన్ని, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా రికార్డుల‌ను, హాజ‌రు ప‌ట్టీని ప‌రిశీలించారు. వివిధ ప‌థ‌కాల అమ‌లు తీరును, స్పంద‌న గ్రీవెన్స్‌ను ప‌రిశీలించారు. మ‌హిళా పోలీసు, ఎఎన్ఎం ల‌ను ప్ర‌శ్నించారు. వారి ప‌నితీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సచివాల‌య సిబ్బంది ప‌నితీరు మెరుగుప‌డాల‌ని, ఇదే తీరు చూపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి, మున్సిప‌ల్ హెల్తాఫీస‌ర్ డాక్ట‌ర్ కెవి స‌త్య‌నారాయ‌ణ‌, స‌చివాల‌యాల క‌న్వీన‌ర్ హ‌రీష్ పాల్గొన్నారు.

Related posts

మన ఊరు మన బడి కార్యక్రమం పనులు వేగవంతం చేయాలి

Satyam NEWS

బోడ్రాయి, సీసీ రోడ్డు నిర్మాణాల‌కు శంకుస్థాప‌న‌

Sub Editor

సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేయాలి

Satyam NEWS

Leave a Comment