విజయనగరం జిల్లాలో బాబు జగజ్జీవన్ రామ్ 135 వ జయంతి స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు…జేసీలు వెంకటరావు,మహేష్ కుమార్,సాంఘిక సంక్షేమ శాఖ ఏడీ, జిల్లా రెవిన్యూ అధికారి గణపతిరావులు ఉన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..తాను ఓ దళిత కుటుంబంలో పుట్టానని కాని యూపీఎస్సీ చదివి…కలెక్టర్ హోదాలో మాట్లాడుతున్నానన్నారు.
జిల్లాలో మూడోసారి బాబూ జగజ్జీవన్ జయంతి కార్యక్రమంలో తాను పాల్గొనడం ఓ అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమాజంలో అసమానతలను,దురాచారాలను రూపుమాపాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమన్నారు.
ఓ దళితుడైన బాబూ జగజ్జీవన్ రామ్…ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎదురైన సమస్యలను ఎదురొడ్డి…అవలీలగా వాటినన్నంటిని డీ కొట్టి సగర్వంగా నిలిచారని కలెక్టర్ కొనియాడారు. అంతకు ముందు జేసీ వెంకటరావు మాట్లాడుతూ….అంబేద్కర్ తర్వాత అంతటి వ్యక్తి బాబూ జగజ్జీవన్ రామ్ అని అన్నారు.