28.7 C
Hyderabad
April 20, 2024 05: 22 AM
Slider విజయనగరం

నేను అవ‌మానింప బ‌డ్డా…కానీ చ‌దువుతో సాధించా…క‌లెక్ట‌ర్ వెల్ల‌డి…!

#VijayanagaramCollector

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బాబు జ‌గ‌జ్జీవ‌న్ రామ్  135 వ  జ‌యంతి స్థానిక క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగింది.  సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన జ‌యంతి కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ తో పాటు…జేసీలు వెంక‌ట‌రావు,మ‌హేష్ కుమార్,సాంఘిక సంక్షేమ శాఖ ఏడీ, జిల్లా రెవిన్యూ అధికారి గణ‌ప‌తిరావులు ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ..తాను ఓ ద‌ళిత కుటుంబంలో పుట్టాన‌ని కాని యూపీఎస్సీ  చ‌దివి…క‌లెక్ట‌ర్ హోదాలో మాట్లాడుతున్నాన‌న్నారు.

జిల్లాలో మూడోసారి బాబూ జ‌గ‌జ్జీవ‌న్ జ‌యంతి కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన‌డం ఓ అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు. స‌మాజంలో అస‌మాన‌త‌ల‌ను,దురాచారాల‌ను రూపుమాపాలంటే చ‌దువు ఒక్క‌టే ఏకైక మార్గ‌మ‌న్నారు.

ఓ ద‌ళితుడైన బాబూ  జ‌గ‌జ్జీవ‌న్ రామ్…ఎన్నో అవాంత‌రాల‌ను ఎదుర్కొని ఎదురైన స‌మ‌స్య‌ల‌ను ఎదురొడ్డి…అవ‌లీల‌గా వాటిన‌న్నంటిని డీ కొట్టి స‌గ‌ర్వంగా నిలిచార‌ని క‌లెక్ట‌ర్ కొనియాడారు. అంత‌కు ముందు జేసీ వెంక‌ట‌రావు మాట్లాడుతూ….అంబేద్క‌ర్ త‌ర్వాత అంత‌టి వ్య‌క్తి బాబూ జ‌గ‌జ్జీవ‌న్ రామ్ అని అన్నారు.

Related posts

తొలి ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రకటించిన జనసేన

Bhavani

జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్‌.పి.ల‌తో నూతన ఎస్ ఇ సి వీడియో కాన్ఫ‌రెన్స్

Satyam NEWS

తొమ్మిది మంది అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్

Murali Krishna

Leave a Comment