అన్ని రంగాలలో ప్రతీ ఒక్కరూ ఆరి తేరి ఉండరు.కాని విజయనగరం జిల్లా కలెక్టర్ మాత్రం..అన్ని రంగాలలో ఆరితేరారు…అని చెప్పకతప్పదు..మీరు నమ్మరా..లేక నేను గొప్పగా కావాలనే చెబుతున్నాననుకుంటున్నారా..? మీకు సందేహం కలిగితే.. ఘంటశాల స్మారక కళాపీఠం వాళ్లను అడిగండి.ఇంతకీ అసలేం జరిగిందంటే… సిరివెన్నల చిత్రంలో..‘ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..’ అనే పాటను విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ స్వయంగా తన గొంతుతో పాడేరు.
ఆ సుమధురమైన గీతాన్ని.. అద్భుతంగా పాడి ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే కలెక్టర్ కాస్సేపు…వృత్తి ధర్మాన్ని కాస్త పక్కన పెట్టి.. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ‘స్వరాల సందమామ’ సంగీత విభావరిలో తన స్వరాన్ని వినిపించారు. అనంతరం కళాపీఠం వ్యవస్ధాపకులు ఎమ్.భీష్మారావు ఆధ్వర్యంలో ప్రతినిధులు కలెక్టర్ హరిజవహర్లాల్ను శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్