27.7 C
Hyderabad
April 19, 2024 23: 34 PM
Slider విజయనగరం

శానిటేష‌న్ సిబ్బందిపై విజయనగరం మునిసిపల్ క‌మీష‌న‌ర్ ఆగ్ర‌హం

#vijayanagaram municipality

స్వ‌చ్చ శానిటేష‌న్…స్వ‌చ్చ విజ‌య‌న‌గ‌రం..స్వ‌చ్ఛ ఆంధ్ర ప్ర‌దేశ్…ఇలా నిన‌దిస్తూ  అనుకున్న స‌మ‌యానికి విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మీష‌న‌ర్ వ‌ర్మ‌..న‌గ‌రంలోని 28వ డివిజ‌న్ ప‌రిధి ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీకి వ‌చ్చారు.కానీ  ఆ స‌మ‌యానికి  ఒక్కరంటే ఒక్క‌రు శానిటేష‌న్ సిబ్బంది కాని…ప్లాంటేష‌న్ సిబ్బంది కానీ లేక‌పోవ‌డం చూసిన క‌మీష‌న‌ర్ వర్మ అక్క‌డ ఉన్న మీడియా ను చూసి….స‌మ‌య‌పాల‌న పాటించేది మీరే… అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

స‌రిగ్గా ఉద‌యం 6.30కు ఎమ్మెల్యే  కోల‌గట్ల వీర‌భ‌ద్రస్వామి శానిటేష‌న్ కార్యక్ర‌మం ప్రారంభిస్తార‌ని వీఎంసీ పీఆర్వో చౌద‌రి తో పాటు ఎమ్మెల్యే  పీఆర్వో మీడియాకు స‌మాచారం ఇచ్చారు. కానీ క‌మీష‌న‌ర్ ,మీడియా మాత్ర‌మే ఆ స‌మయానికి వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే ,మేయ‌ర్, స్థానిక డివిజ‌న్ కార్పొరేట‌ర్,డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గట్ల శ్రావ‌ణిలు రావ‌డం అదే స‌మ‌యంలోనే మున్సిప‌ల్ హెల్త్ ఇన్ స్పెక్ట‌ర్…శానిటేష‌న్ సిబ్బంది వ‌చ్చారు. అంత‌కు ముందే యూనీఫాం ధ‌రించిన  శానిటేష‌న్ సిబ్బందికి క‌మీష‌న‌ర్ వ‌ర్మ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు…రేప‌టి నుంచీ యూనీఫాం లో రాక‌పోతే ఉద్యోగానికే రావ‌క్క‌ర్ల‌దేని హెచ్చ‌రించారు.

పార ,గునపం పట్టిన ఎమ్మెల్యే.. శానిటేషన్ కార్యక్రమంలో ప్ర‌జాప్ర‌తినిధి అవ‌తారం.!

తెల్లవారు లేవంగానే ఎవ్వరైనా వాళ్ల కు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తారు.కానీ తమ రాజకీయ ధైవం..విజయనగరం ఎమ్మెల్యే పొద్దు పొద్దున్నే మమ్మల్ని తిడతారని బహుశా వాళ్ళు ఊహించి ఉండరు.ఆగస్టు 1 నుంచీ శానిటేషన్ నెలని బహుశా మరిచి ఉంటారు. ఈ మేరకు మేయర్ విజయలక్ష్మి తో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి.. నగరంలో ని లంకవీధి సమీపం..ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద.. స్వయంగా పార ,గునపాం పట్టి…పరిసరాలను శుభ్రపరిచారు.ఈ క్రమంలో ఆ పనిముట్లు ఏవని మున్సిపల్ కమీషనర్ వర్మ ముందే శానిటేషన్ సిబ్బంది ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి    అడిగినా నాన్చటంతో….ఎమ్మెల్యే శివమెత్తారు.

న‌గ‌రంలో స్వ‌చ్చ శానిటేష‌న్ ప్రొగ్రామ్ ను ప్రారంభించిన ఎంపీ బెల్లాన‌….!

కార్పొరేష‌న్ గా ఎదిగిన విజ‌య‌న‌గ‌రంలో తొలిసారిగా నిర్వహించిన   శానిటేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా  స్వ‌చ్చ విజ‌య‌న‌గ‌రంను ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ ప్రారంభించారు.ఈ  సంద‌ర్బంగా ఎంపీ బెల్లాన మాట్లాడుతూ ఈ ఆగ‌స్టు మాసంలో స్వ‌చ్చ  శానిటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం  నిర్వ‌హించ ద‌ల‌చిందని….ప్ర‌జాప్ర‌తినిధిగా త‌న పార్లమంట్ నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో స్థానిక ఎమ్మెల్యే అభ్య‌ర్ధ‌న మేర‌కు తానిక్కడ కువ‌చ్చి పాల్గొన్నాన‌న్నారు.

స్థానిక ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ వ‌ద్ద పెద్ద ఎత్తున డెబ్రీస్ ను ఎమ్మెల్యేతో శుభ్రం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అంత‌కుముందు ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ.. స్వ‌చ్చ విజ‌య‌న‌గ‌రంలో  భాగంగా ఆరు డివిజ‌న్ల‌ను క‌లిపే కాల్వ‌ను ప‌రిశుభ్రం చేయ‌డం జరిగిందిన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో క‌మీష‌న‌ర్ వ‌ర్మ‌తో పాటు హెల్త్ ఆఫీస‌ర్, 28 డివిజ‌న్ కార్పొరేట‌ర్,డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి స్థానిక కార్పొరేట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

బిస్కెట్లు కొనివ్వమంటే అసభ్యంగా ప్రవర్తించిన తాత

Satyam NEWS

అంబర్ పేట్ అమ్మవారి దేవస్థానంలో కొత్త సభ్యులకు అవకాశం కావాలి

Bhavani

తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టాలి

Satyam NEWS

Leave a Comment