మీరు చదివింది నిజమే… ఏపీ పోలీసులు అదుపులో తెలంగాణ రాష్ట్రం కు చెందిన ఓ దొంగ పట్టు బడ్డాడు..ఇదే విషయాన్ని విజయనగరం వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఆరు దొంగ తనాల కేసుల్లో ముద్దాయి అయిన అతగాడిని వన్ టౌన్ పోలీసులు… పక్కా సమాచారం మేరకు అదుపులో తీసుకుని విచారిస్తే… మనోడి చేతివాటం బట్టబయలైంది.
విజయనగరం లో బైకులు ,కే.ఎల్.పురంలో ఓ ఇంటిలో దొంగతనంకు పాల్పడిన తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా మల్లేశ్వరం కి చెందిన 31 ఏళ్ల కుమ్మరి భాస్కరరావు అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని ఆరు కేసుల్లో అరెస్టు చేసి, నిందితుడు నుంచీ నుండి నాలుగు మోటారు సైకిళ్ళు, ఒక ఎల్.ఇ.డీ టివి, ఒక జత దిద్దులు ను రికవరీ చేసినట్లుగా వన్ టౌన్ సిఐ డా. బి.వెంకటరావు తెలిపారు.సీఐతో పాటు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి.శ్రీకర్, ఎస్ఐలు అశోక్, భాస్కరరావు పాల్గొన్నారు.
ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన ఎస్ఐ అశోక్, హెచ్ సిలు ఆచ్చిరాజు, ఎ.రమణ, కానిస్టేబుళ్లు పి.శివ శంకర్, కే.శ్రీనివాసరావు, సిహెచ్. తిరుపతిరావు లను సీఐ వెంకటరావు అభినందించారు.