విజయనగరం జిల్లా కేంద్రంలోని బ్యారెక్స్ వద్ద శ్రీశ్రీశ్రీ దండుమారమ్మ టెంపుల్ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సతీసమేతంగా పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ దంపతులతో ఆలయ ప్రాంగణంలో నిర్వహించే యాగంలో స్వయంగా పాల్గొ్న్నారు.
ఇక జిల్లా ఎస్పీ రాజుకుమారీ… సంప్రదాయ దుస్తులతో చీర ధరించి…దండుమారమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసారు.
అనంతరం…ఆలయ ప్రధాన అర్చకులు స్వయంగా ఎస్పీ చే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈ సందర్బంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ… పోలీస్ శాఖ ఆద్వర్యంలో నడుస్తున్న దండుమారమ్మ టెంపులు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయన్నారు.
అదీ శ్రీ ప్లవనామ సంవత్సరం రోజున ప్రారంభమై ఏడు రోజుల పాటు జరుగుతాయని ఎస్పీ తెలిపారు. ఆ తల్లి కృప వలన కరోనా మహమ్మారి తరలిపోతుందన్న ఆశాభావంతో యావత్ ప్రజానీకం పూజలు చేస్తోందని ఎస్పీ అన్నారు.
ఎస్పీ తో పాటు ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ఏఆర్ఎస్ లు, పోలీస్ పీఆర్ ఓ కోటేశ్వరరావు, సిబ్బంది కిషోర్ ఫోటో గ్రాఫర్లు, సత్యనారాయణ,కృష్ణ వీడియో గ్రాఫర్ షణ్ముక్ ఇతర పోలీస్ సిబ్బంది అంతా మఫ్టీలో హాజరయ్యారు.